
జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారి ఆదేశాలతో జిల్లాలోని వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదై, దర్యాప్తులో
ఉన్న సైబరు కేసులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత జిల్లా పోలీసు కార్యాలయంలో జూన్ 10న సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మాట్లాడుతూ – సైబరు నేరాలను చేధించేందుకు దర్యాప్తును వేగవంతం చేయాలని, కేసుల మిస్టరీని చేధించి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. సైబరు నేరాలను చేధించేందుకు
అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని దర్యాప్తు అధికారులు మెరుగుపర్చుకోవాలన్నారు. సైబరు నేరాల్లో బాధితులు ఏ తరహాలో మోసపోయింది, ఆయా కేసుల్లో ఇప్పటి వరకు సంబందిత దర్యాప్తు అధికారులు చేపట్టిన దర్యాప్తు, తీసుకున్న చర్యలను అధికారులను అడిగి అదనపు ఎస్పీ తెలుసుకున్నారు. సైబరు నేరాలు జరిగిన వెంటనే బాధితులు స్పందించి, సకాలంలో 1930కు ఫిర్యాదు చేసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. సైబరు మోసానికి గురైన తరువాత బాధితుల నగదు ఎవరి బ్యాంకు ఖాతాలకు బదిలీ జరిగింది, ఎక్కడ, ఎవరు ఆయా నగదును విత్ డ్రా చేసింది అన్న వివరాలను
సాధ్యమైనంత వేగంగా రాబట్టాలన్నారు. అనంతరం, ఆయా బ్యాంకు ఖాతాల నుండి నిందితులు నగదును విత్ డ్రా చేయకుండా నగదును ఫ్రీజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తదుపరి ఫ్రీజ్ అయిన నగదు కోర్టు అనుమతితో బాధితుల బ్యాంకు ఖాతాకు జమయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సైబరు మోసాలను
నియంత్రించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు వంపే లింకులు,ఈ-మెయిల్స్, క్యూ ఆర్ కోడ్లను క్లిక్ చేయవద్దని, మోసగాళ్ల ప్రలోభాలకు లొంగవద్దని, ఒటిపి లను ఎవరికి షేర్ చేయకుండా ఉండాలని ప్రజలకు అవగాహన
కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నేరాలకు పాల్పడిన సైబరు మోసగాళ్ళను సాంకేతికత ఆధారంగా గుర్తించి, వారిని త్వరితగతిన అరెస్టు చేయాలన్నారు. సైబరు మోసాలకు గురైన వారు సకాలంలో https://cybercrime.gov.in/ లేదా 1930 ఫిర్యాదు గారు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అదనపు ఎస్పీ పి.సౌమ్యలత
ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో సిఐలు బి.సుధాకర్, బి.శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాస్, టి.శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, శంకరరావు, ఎల్.అప్పల నాయుడు, కే.నారాయణరావు, జి.రామకృష్ణ, కే.దుర్గా ప్రసాద్, షణ్ముఖరావు, ఎ.అశోక్ కుమార్, వి.నారాయణమూర్తి, ఎస్ఐలు నజీమా బేగం, రమేష్ కుమార్, షేక్ శంకర్, కే.కిరణ్ కుమార్ నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.