
విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో 2018సం.లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితులు
ముగ్గురికి 1సం. సాధారణ జైలు, రూ.51వేలు జరిమానా విధిస్తూ విజయనగరం జె.ఎఫ్.సి.ఎం. (స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి కుమారి పి.బుజ్జి గారు తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు జూన్ 10న తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణంకు చెందిన ప్రవీణ గోగులకు తమిళనాడు రాష్ట్రం పెరంబదూర్కుచెందిన పసుపులెట్టి జాషువతో 2017సం.లో వివాహం అయ్యిందని, వివాహ సమయంలో రూ.10 లక్షలు కట్నం,
మూడు తులాలు బంగారు వస్తువులను కానుకగా తన కన్నవారు ఇచ్చినారని, వివాహం అనంతరం భర్త పసుపులెట్టి
జాషువ, అతని తల్లిదండ్రులు భాస్కరరావు, సుజాతలు అదనంగా మరో రూ.5లక్షలు కట్నంగా తీసుకురావాలని
శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడేవారని మహిళా పోలీసు స్టేషనులో తే.06-08-2018 దిన ఫిర్యాదు చేసారు. ప్రవీణ గోగుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి మహిళా పిఎస్ ఎస్ఐ ఎ.వెంకటరావు కేసు నమోదు చేసి,
దర్యాప్తు చేసి, నిందితులను అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారని డీఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు.
కోర్టు విచారణలో ఫిర్యాది భర్త పసుపులెట్టి జాషువ (ఎ-1), మామ పసుపులెట్టి భాస్కరరావు (ఎ-2) మరియు అత్త
పసుపులెట్టి సుజాత (ఎ-3) వరకట్న వేధింపులకు పాల్పడినట్లుగా రుజువు కావడంతో నిందితులు ముగ్గురికి 1సం. సాధారణ జైలు, రూ.51వేలు జరిమానా విధిస్తూ విజయనగరం జె.ఎఫ్.ఎం.సి. (స్పెషల్ మొబైల్ కోర్టు) న్యాయమూర్తి
తీర్పు వెల్లడించారని మహిళా పిఎస్ డిఎస్పీ తెలిపారు. ఈ కేసులో పోలీసువారి తరుపున ఎపిపి శాంతి గౌతమి వాదనలు వినిపించగా, కేసును అప్పటి ఎస్ఐ ఎ.వెంకటరావు దర్యాప్తు చేయగా, కోర్టు కానిస్టేబులు వై.పూర్ణ సాకులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారని మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు తెలిపారు.