A2Z सभी खबर सभी जिले की

 

*రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విరాజిల్లడానికి ముఖ్య పాత్ర పోషించేది జర్నలిస్టులే:*

*@- నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు*

Related Articles

అమరావతి, వార్తా ప్రపంచం: జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను కలసి వినతిపత్రాన్ని అందచేసి సమస్యలపై చర్చించారు…

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర వ్యవస్థకు ఊపిరి వంటిది. అలాంటి జర్నలిజంను ఊపిరిగా భావించి జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సమాజంలో అసమానతలు తొలగించి సమసమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. జర్నలిస్టులు ఆర్ధికంగా, వృత్తి పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కొరకు స్థాపించిన “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” జర్నలిస్టుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపటానికి జాతీయ స్థాయిలో అవిశ్రాంత పోరాటం చేస్తూ అనతికాలంలోనే భారతదేశంలో అత్యధిక సభ్యులు కలిగి జర్నలిస్టుల గుండెచప్పుడు గా అగ్రభాగంలో నిలిచింది.. ఎన్.ఎ.ఆర్.ఎ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుల కి దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్య లక్ష్యంగా కృషి చేస్తూ వస్తుంది. జర్నలిజం మూలాలను బ్రతికించి, జర్నలిస్టుల విలువను పెంచడానికి “నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్” అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది..

‘అభద్రత‘ లో ఉన్న రంగం కేవలం ఒక్క ‘పాత్రికేయం’ మాత్రమే. అందుకే పాత్రికేయ రంగం లో ఉన్నటువంటి ఈ అభద్రతా భావం నుండి నిజమైన పాత్రికేయ మిత్రులను సంరక్షించి వారికి ఓ సరైన మార్గాన్ని నిర్దేశించి దాని కొరకు అహర్నిశలూ నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) తరపున అనేక కమిటీలు ఏర్పాటు చేసి జర్నలిస్టులకు, ప్రభుత్వాలకు ఒక వారధిలా పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేస్తోంది. స్మాల్ న్యూస్ పేపర్స్ వింగ్, న్యూ మీడియా వింగ్ (యూ ట్యూట్, వెబ్ సైట్స్), యూత్ వింగ్, ఉమెన్స్ వింగ్, అక్రిడిటేషన్ కమిటీ, ఆర్టీఏ వింగ్, లీగల్ వింగ్, స్టడీ టీమ్, నిజ నిర్ధారణ కమిటీ, హ్యూమన్ రైట్స్ వింగ్, సర్వే వింగ్, యాక్షన్ కమిటీ, ఫిల్మ్ & టివి ఇండస్ట్రి వింగ్, ఆడిట్ వింగ్ లాంటి వివిధ కమిటీల రూపంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారి జీవితాల్లో వెలుగులు చూడటమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళుతుంది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఎ) ముఖ్యమైన డిమాండ్లను వినతి పత్రం రూపంలో ఆయన ముందు ఉంచింది. జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తానని, జర్నలిస్టులకు సంక్షేమ రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కు నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలియచేసారు.

ఈ సందర్భంగా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ & ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు మాట్లాడుతూ రాజకీయాల లోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విరాజిల్లడానికి, పరుగెత్తే కాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతి దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలో కానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమన్నారు. జర్నలిస్టుల కు సంక్షేమం రక్షణ కల్పించడంలో పాత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కోరినట్లు తెలియజేశారు.

Back to top button
error: Content is protected !!