విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగ్లాదేశ్ సరిహద్దులలోకి పొరపాటున ప్రవేశించి కోస్ట్ గార్డుల చెరలో చిక్కుకున్న ఘటనపై ఎపి మార్క్ ఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇంన్చార్జ్ కర్రోతు బంగార్రాజు తీవ్రంగా స్పందించారు. తమ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావిస్తూ, మత్స్యకారుల విడుదల కోసం కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడుతో పాటు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లను సంప్రదించి సంబంధిత అధికారులతో మాట్లాడి, బంగ్లాదేశ్ ప్రభుత్వం ద్వారా వారందరిని సురక్షితంగా తిరిగి తీసుకురావాలని కోరారు.