
విజయనగరంలోని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును గుర్ల మండలం జమ్ము గ్రామ ప్రజలు బుధవారం కలిశారు. ఇటీవల దుర్గాదేవి అనుపోత్సవంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరిపై లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. తమ వారిపై ఎదురు కేసులు పెట్టి అరెస్ట్లు చేశారని పలువురు చిన్న శ్రీను ఎదుట వాపోయారు. అండగా ఉంటామని జడ్పీ ఛైర్మన్ భరోసా కల్పించారు.
