A2Z सभी खबर सभी जिले की

కారు డోర్లో తరలిస్తున్న 23 కిలోల గంజాయి సీజ్ చేసిన పోలీసులు

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషను పరిధిలోని మంగళపాలెం కూడలి వద్ద పోలీసులు వాహన
తనిఖీలు చేపట్టి, పక్కా సమాచారంతో 23 కిలోల గంజాయిని, ఒక కారు డోరులో పెట్టి అక్రమ రవాణకు పాల్పడుతున్న
ఇద్దరు వ్యక్తులను కొత్తవలస పోలీసులు అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 6న తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే.. కొత్తవలస పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో కొత్తవలస సిఐ షణ్ముఖరావు
ఆధ్వర్యంలో ఎస్ఐ మన్మధరావు పోలీసు సిబ్బంది మే 5న మంగళపాలెం కూడలి వద్ద వాహన తనిఖీలు చేపట్టగా,
కొత్తవలస వైపు నుండి విశాఖపట్నం వైపు ఒక వ్యక్తి ఎపి 39 ఏఈ 7502 నెంబరు పల్సర్ మోటారు సైకిల్ పై వస్తూ పోలీసులను వాహన తనిఖీలు చేస్తుండగా మోటారు సైకిల్ వదిలి అక్కడ నుండి పరారైనట్లు, ఆ వెనుకనే వస్తున్న ఒక స్విఫ్ట్ డిజైర్ ఎపి 39 ఎఫ్ పి 9061 నెంబరు గల కారు 50 అడుగుల దూరంలో డ్రైవరు పోలీసులను చూసి
వెనక్కి త్రిప్పే ప్రయత్నం చేయగా వెంటనే ఎస్పై మన్మధరావు తన సిబ్బందితో సదరు కారును స్వాధీనం చేసుకొని, కారు
డ్రైవరుతో పాటు మరోక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారన్నారు. కారును క్షుణ్ణంగా పరిశీలించగా కారు యొక్క డోరులో
23 కేజీల బరువుగల 48 గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారన్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారణ చేయగా ఒరిస్సా నుండి హైదరాబాద్కు తరలించేందుకు గంజాయిని కొనుగోలు చేసి, ఎవ్వరికీ అనుమానం రాకుండా
కారు యొక్క డోరులో గంజాయి ప్యాకెట్లు పెట్టి, హైదరాబాదు తరలిస్తుండగా పట్టుబడ్డారన్నారు. నిందితులు రేగిడి
సమీపంలోని పెద్దచర్ల గ్రామానికి చెందిన ఎ-1 పి.జనార్ధనరావు, ఎ-2 పి.రాంబాబులు గా గుర్తించామని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 23 కిలోల గంజాయి, స్విఫ్ట్ డిజైర్ కారు, ఒక పల్సర్ బైక్ను రెవిన్యూ అధికారుల
సమక్షంలో సీజ్ చేసి, కేసు నమోదు చేసి ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండుకు తరలించారని జిల్లా ఎస్పీ తెలిపారు.
పట్టుబడిన 23 కిలోల గంజాయి విలువ రూ. 2లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో ఈ కేసులో గంజాయి అక్రమ రవాణాకు బైక్పై పైలట్గా వ్యవహరించి పరారైన వ్యక్తికి సంబంధం ఉన్నట్లుగా గుర్తించామని,
అతన్ని కూడా త్వరలో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు చెక్ పోస్టులు మరియు ఆయా పోలీసు
స్టేషన్ల పరిధిలో ఎప్పటికప్పుడు నిరంతరం డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్న కారణంగా ఇటీవల గంజాయి పట్టుకోగలుగు
తున్నామన్నారు. గంజాయి పట్టుకోవడంలో సమర్ధవంతంగా పని చేసిన కొత్తవలస సిఐ షణ్ముఖరావు, ఎస్పై మన్మధరావు
మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.

 

Related Articles
Back to top button
error: Content is protected !!