A2Z सभी खबर सभी जिले की

మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాక మెంటాడ

మెంటాడ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి రానున్నారు. రేపు కొండలింగాలవలస నుండి గజంగుడ్డివలస వరకు కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ — ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, యువకులు పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమం మెంటాడ మండల అభివృద్ధి దిశగా మరో కీలక అడుగుగా నిలుస్తుందని తెలిపారు.

Related Articles
Show More
Back to top button
error: Content is protected !!