
మెంటాడ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి రానున్నారు. రేపు కొండలింగాలవలస నుండి గజంగుడ్డివలస వరకు కోటి యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ఒక ప్రకటనలో మాట్లాడుతూ — ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, యువకులు పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమం మెంటాడ మండల అభివృద్ధి దిశగా మరో కీలక అడుగుగా నిలుస్తుందని తెలిపారు.
