
విజయనగరం ఉగ్రదాడి అనుమానితుల కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మినిస్ట్రీ ఆప్ హోం ఎఫైర్స్ నుంచి అనుమతి తీసుకుంది. NIA కేసు అప్పగించేందుకు విజయనగరం 2 టౌన్ పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. విశాఖ సెంట్రల్ జైలులో ఉగ్రదాడి కేసులో అనుమానితులు సిరాజ్, సమీర్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఉగ్రదాడి కావడంతో మరింత లోతైన దర్యాప్తు కోసం తాజాగా NIA చేతిలోకి తీసుకుంది.