A2Z सभी खबर सभी जिले की

* కోటలో మహానాడును జీర్ణించుకోలేకపోతున్న జగన్!*

మహానాడు వైభవం, పసుపు జెండాల సందడి చూసి జగన్‌రెడ్డి గారికి అసూయతో రగిలిపోయాడు. “చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది? ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది” అంటూ తనలో పేరుకుపోయిన అసూయను బహిరంగంగానే వెళ్లగక్కారు.

కడప ప్రజలు ఈసారి తేల్చేశారు! జగన్‌రెడ్డి గారికి రెండు పెదాలతో (పులివెందుల & బద్వేల్) నోరు మూసేసి, మాడు పగలగొట్టినట్టు తీర్పు ఇచ్చారు. దానికి తోడు, కడప కోట మొత్తం పసుపు మయం కావడంతో, జగన్‌కు పైత్యం తారాస్థాయికి చేరినట్లుంది. అందుకే, ఆ మాటలు నోరు జారి వచ్చేశాయి.

జగన్‌రెడ్డి గారి తాజా మాటలు వింటుంటే, కడపలో ఆయన ‘ఫోజుల’ సత్తా మరోసారి గుర్తుకొస్తోంది. “చిన్నాయన హత్య గురించి ఆ దేవుడికే తెలుసు” అంటూ కడప సభలో ఆకాశం కేసి చూస్తూ ఇచ్చిన ఫోజులు, సొంత కుటుంబ సభ్యుల శీలాలను శంకిస్తూ ప్రజల్లో పరువు తీసిన ‘సత్తా’ ఈయనది కాదా? నాయన గారు ఒకసారి, మధ్యలో బాబు గారు ఒకసారి, ఆ తర్వాత ఐదేళ్లలో ఈయనే రెండుసార్లు కడప స్టీల్ ప్లాంట్ కోసం శంకుస్థాపనలు చేసి, దానిని మాత్రం గాలిలో దీపంగా నిలిపిన ‘సత్తా’ ఈయనదే కదా!

Related Articles

“ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది” అన్న జగన్‌రెడ్డి గారి మాటలు విన్న ప్రజలు పగలబడి నవ్వుకుంటున్నారు. “ఈ మాటలు మీరే అన్నారా జగన్ గారు?” అని జనం పెదవి విరుస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీ ‘సత్తా’ గురించి గత ఐదేళ్లలో ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కదా! ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం… ఇలా లెక్కలేనన్ని హామీలు గాలిలో కలిసిపోయాయి. ముఖ్యంగా, 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఆశపెట్టి ఏమార్చింది, “బిడ్డ బిడ్డకూ అమ్మ ఒడి” అంటూ ఇంట్లో ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చి మిగిలిన పిల్లలను మోసం చేసిన ‘బూచోడు’ జగన్‌రెడ్డి గారు కాదా? ఆ హామీలు నెరవేర్చడంలో ఈయన ‘సత్తా’ ఎక్కడికిపోయింది?

కుప్పంకు వెళ్లి కుప్పిగంతులు వేసి, పెద్దిరెడ్డి అరాచకంతో కుప్పం మున్సిపాలిటీ గెలిచానని విర్రవీగిన జగన్‌కు, విజ్ఞులైన పులివెందుల పట్టభద్రులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరువు తీశారు. మాకు సపరేటు ఓటర్ల సెక్షన్ వున్నారని ఫోజులు కొట్టి, “వైనాట్ 175” అంటూ కుప్పం కూడా గెలుస్తామని బడాయి కబుర్లు చెప్పి, కడపలోనే కేవలం 2 సీట్లకే పరిమితమై బొక్కాబోర్లా పడ్డాడు జగన్. చెల్లి రాష్ట్ర పర్యటన మొదలెడుతోంది. ఆవిడతో పోటీ పడడానికి, నిన్నంతా ఆంధ్రాలో భారీ వర్షాల వల్లా ప్రకాశానికి రానని పర్యటన రద్దని చెప్పి, యలహంకా ప్యాలస్ నుండి యమ అర్జంటుగా తాడేపల్లికి తగలడి, తట్టుకోలేకుండా సత్తాల గురించి చెబుతున్నాడు. గుడ్డి ముసల్ది కూడా ఒత్తుతుంది బటన్. కానీ ఈయన చేసిన అరాచకానికి ఈ జన్మలోనే కాదు.. వచ్చే జన్మలో కూడా జనం నమ్మరు. ఈ దొంగ లక్షణాలతో ఎవడు వచ్చినా సిఎంలు కాలేరు. ఆంధ్రాకు ఆ రేంజ్ లెస్సన్ నేర్పింది ఈ జగ్గూభాయే.

Back to top button
error: Content is protected !!