
నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా వారు భారతరత్న సుబ్రహ్మణ్యం గారి పేరు మీదగా జాతీయస్థాయిలో పేదల అభ్యున్నతికి కృషి చేసేవారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.
జాతీయ స్థాయిలో ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ఈ జాతీయ అవార్డుకు దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు ఎంపికైనారు.
భారతదేశంలో 2024-25 వ సంవత్సరానికి గాను 14 మందిని ఎంపిక చేయగా అందులో పెంకి చిట్టిబాబు ను దళిత ఆదివాసీల బహుజనుల జీవితాలను మార్చేందుకు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సేవలకు గాను అందులో చోటు దక్కింది. దళిత ఆదివాసి మానవ హక్కుల పరిరక్షణ ఉద్యమంలో చేసిన కృషిని గుర్తించి అవార్డు తో పాటు ఒక లక్ష రూపాయల అవార్డు ప్రధానోత్సవం చేయనున్నారు.
ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును మే 22 వ తేదీన ఇండియన్ హాబిటేట్ సెంటర్, న్యూ ఢిల్లీ లో అందుకోనున్నారు.
ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం పట్ల పెంకి చిట్టి బాబు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరియు దళిత ఆదివాసీల బ్రతుకుల్లో మార్పు చేసేందుకు మరింత బాధ్యత పెరిగిందని తెలియజేశారు.
దక్షిణాది రాష్ట్రాల నుండి ఒకే ఒక్కడు ,మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం , వెనుకబడిన విజయనగరం జిల్లా నుండి చిట్టిబాబు ఎంపికావడం హర్షణీయం దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కె శిరీష, కోశాధికారి పి శేషరత్నం, సంయుక్త కార్యదర్శి కె సి హెచ్ బంగారు రాజు, వివిధ ప్రజా సంఘాలు,స్వస్చంద సంస్థ ప్రతినిధులు, దళిత మానవ హక్కుల ఉద్యమ సంస్థల ప్రతినిధులు పి చిట్టిబాబుకు అభినందనలు తెలియజేశారు.