
విజయనగరంలోని వై జంక్షన్ వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ప్రశాంతంగా నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంతో జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తమ సర్వీసులు నిలిపివేస్తూ ప్రశాంతంగా వ్యతిరేకత తెలుపుతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు వెంటనే న్యాయం చేయాలని కోరారు.
