
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఛానెల్ అయిన మహాన్యూస్ పై బీ.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్తలు దాడి చేయడాన్ని విజయనగరం జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు . దాడిని ఖండిస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక కోట వద్ద నుండి మూడు లాంతర్లు జంక్షన్ వరకూ జర్నలిస్టులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. దాడిని ఖండిస్తూ నిజానిజాలు చేసారు. ఈ సందర్బంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ బీ.ఆర్.ఎస్. పార్టీ మీద వస్తున్న వార్తలకి వివరణ ఇవ్వకుండా సహనం కోల్పోయి బీ.ఆర్.ఎస్ కార్యకర్తలను ఉసిగొల్పి మహా న్యూస్ కార్యాలయం మీద దాడిచేసి కార్లు, ఫర్నీచర్ ను, అద్దాలు , కెమెరా లను ధ్వంసం చేయడంతో పాటు మహాన్యూస్ చైర్మన్ అండ్ ఎండీ వంశీకృష్ణ మీద, ఇతర జర్నలిస్టుల మీద దాడికి యత్నించడం, హత్యాయత్నం చేయడం దారుణమని తెలిపారు. ఒక ప్రముఖ రాజకీయ పార్టీగా ఇలాంటి దాడులు చేసే సంస్కృతిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లు ప్రోత్సహించడం విచారకరమని తెలిపారు. ఈ మీడియా పై దాడిని మిగతా రాజకీయ పార్టీలు, మేధావి వర్గం అందరు తీవ్రంగా ఖండించాలని , బాధ్యులైన వారిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.