
డెంకాడ శివారులో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయనగరం నుంచి నాతవలస వెళ్తున్న ఆర్టీసీ బస్సు, డెంకాడ నుంచి విజయనగరం వస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొన్నాయి.అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు.ఈప్రమాదంలో ఏడుగురి స్కూల్ పిల్లలుకు స్వల్ప గాయాలు అయ్యాయి.