
మీరెప్పుడైనా రాష్ట్ర సచివాలయంలో అడుగుపెట్టారా..? పోనీ అక్కడ ఉద్యోగం వస్తే వద్దంటారా..? ఈ ఆశలన్నీ కల్పించి ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న పలువురికి ఫోన్ స్టేటస్ ద్వారా ఆశ కల్పించి ఒకటి కాదు రెండు పదికాదు ఇరవై కాదు….ఏకంగా యాభై లక్షలు వసూలు చేసిన ముఠాను విజయనగరం వన్ టౌన్ సీఐ శ్రీనివాస్,ఎస్ఐ ప్రసన్న కుమార్ లు పట్టుకున్నారు.ఇందుకు సంబంధించి విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ ,వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం ధర్మవరం కు చెందిన వినోద్ పిర్యాదు మేరకు తీగలాగిన వన్ టౌన్ పోలీసులు మొత్తం డొంకనే పట్టుకున్నారు. హైదరాబాద్,విజయవాడ,గుంటూరు,జంగారెడ్డి గూడెం,విజయనగరం జిల్లాల నుంచీ ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న ఆరుగురి నుంచీ ఒక్కొక్కొరి నుంచీ అయిదు నుంచీ ఎనిమిది లక్షల వరకు డబ్బులు వసూలు చేసారా గ్యాంగ్.ఫేక్ కంపెనీ అపాయింట్ మెంట్ లెటర్లు,ఐడీ కార్డులు ఇప్పించారు.అలాగే రాష్ట్ర సచివాలయం వెలగపూడికి తీసుకెళ్లిన ఆ గ్యాంగ్ లో ముఖ్యమైన వ్యక్తి సుజిత్ తనకు అందరూ పరిచయమే నంటూ అక్కడే వారం రోజుల ఉంచి భోజనాలు పెట్టించి మరీ కంపెనీ ఆపాయింట్ మెంట్ లెటర్స్ ఇప్పిండచంతో ఇక ఉద్యోగాలు వచ్చేసాయని వాళ్లంతా ధీమాగా ఉన్నారు.తీరా అపాయింట్ మెంట్ లో ఉన్న అడ్రస్ ను సంప్రదిస్తే…డబ్బులిచ్చిన వాళ్లని వెక్కిరడచంతో లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ముఠాలో విజయనగరంకు చెందిన మహేష్,జంగారెడ్డి గూడెం కు చెందిన రుబీన్,ఏలూరుకుచెందిన జాన్,యాకుబ్ లను అరెస్ట్ చేసామని డీఎస్సీ శ్రీనివాస్ చెప్పారు. ప్రధాన నిందితుడువిజయనగరం ప్రదీప్ నగర్ కు చెందిన సుజీత్ ప్రస్తుతం హాస్పటల్ లో చికిత్స పొందుతున్నాడన్నారు.