దివ్యాంగులు, ప్రత్యేకావసరాలు గల పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని మంత్రి శ్రీనివాస్ అన్నారు. ప్రత్యేక అవసరాలు గల సుమారు 100 మంది విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం జరిగింది. అవకాశాలు కల్పిస్తే దివ్యాంగులు కూడా ఇతరులతో సమానంగా ఉన్నత స్థానాలను సాధిస్తారని అన్నారు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు.