యోగా పట్ల ప్రజలకు మరింత చైతన్యం కలిగించేందుకు యోగా చిత్రాలను చిత్రీకరింపజేస్తున్నట్లు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య శనివారం తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో నగరంలోని ఎత్తు బ్రిడ్జి, మయూరి జంక్షన్లో ఆకర్షణీయంగా యోగా చిత్రాలను రూపుదిద్దుకుంటున్నాయన్నారు. ఆరోగ్యవంతమైన సమాజానికి యోగా అవసరం ఎక్కువ ఉందని అన్నారు.