
వినతి ఉపాధ్యాయుల బదిలీల సమస్యలను పరిష్కరించాలని STU జిల్లా నేతలు కోరారు. ఈ మేరకు విజయనగరంలోని విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో మాణిక్యాల నాయుడిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని STU జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జోగారావు, సూరిబాబు విజ్ఞప్తి చేశారు.