
మెంటాడ: రక్తదానం మరొకరికి ప్రాణదానమని రక్తదానం చేయండి ప్రాణదాతకండి అని యువతకు పిలుపునిచ్చారు ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు. వీర జవాన్ మురళి నాయక్ జ్ఞాపకార్థకంగా ఆదివారం మెంటాడ గ్రామంలో క్విక్ డోనర్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ రేగిడి రాంబాబు సమక్షంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు పాల్గొని సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ప్రమాదాలలో అనేక రోగాలలో సమయానికి రక్తం దొరకక ప్రాణాలు పోతున్నాయని అటువంటి వారికి దాతలు చేసిన రక్త దానం వారి ప్రాణాలు కాపాడుతున్నాయని అందుకే రక్తదానం చేయండి ప్రాణదాత కండి అని కోరుతున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా రక్తదానం చేయడానికి ఎంతోమంది యువత ముందుకు వచ్చిందని ఇది ఎంతో శుభ పరిణామం అని అన్నారు. యువత సేవా కార్యక్రమాల వైపు ప్రయాణం చేస్తే తన సహాయ సహకారాలు రాజకీయంగా వ్యక్తిగతంగా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. సుమారు 40 మంది రక్తదానం చేసినట్లు గ్రామ సర్పంచ్ రేగిడి రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రంగరాజు, గ్రామ యువత కొల్ల భరత్, గండ్రేటి వాసు, దాసరి ప్రసాద్, మీసాల శివాజీ, పాండ్రంకి శివాజీ, క్విక్ డోనర్ బ్లడ్ గ్రూప్ సభ్యులు యువత తదితరులు పాల్గొన్నారు.