ఎవరికి తలవంచని నేటి తరం హీరో కలేకూరి ప్రసాద్ అని బహుజన నేతలు తమిరెడ్డి శివ శంకర్.గంటాన అప్పారావు. పి.ప్రభాకర రావు పిలుపు నిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలో జి.ఎస్.ఆర్ హోటల్ లో కలేకూరి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆదాడ మోహన్ రావు అద్యక్షుత జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ కాన్షీరాం ఆశయ సాధన కోసం బహుజన రాజ్యాం కోసం కలేకూరి ప్రసాద్ పనిచేశారని కొనియాడారు.వక్తగా.రచయిత గా.అనువాదకుడిగా. ఉద్యమకారుడిగా అనేక పాత్రలు కలేకూరి పోసించాడని కొనియాడారు. ఈకార్యక్రమంలో డా.కంఠ వేణు.మిరియాల కృష్ణారావు. బొత్స బుద్ధుడు. చల్లా రామారావు. పి.చిట్టియ్య.ఆతవ ఉదయ భాస్కర్. కె.గణపతి తదితరులు పాల్గోన్నారు. ఈకార్యక్రమంలో బహుజ కళామండలి సభ్యులు కె.సత్య.జి.సూర్యనారాయణ. కె.అప్పారావు తదితరులు పాల్గోన్నారు.