
ట్రైబల్ యూనివర్సిటీలో ద్వితీయ సంవత్సరం ఎంబీఏ చేస్తున్న తనపై భౌతికంగా దాడిచేసి గాయపరిచిన రెవెన్యూ ఉద్యోగి సతీశ్ని వెంటనే అరెస్టు చేయాలని పి.నాని బాబు కోరారు. సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. బైక్పై వెళ్లేటప్పుడు బురద తుళ్లినందుకు తనను విచక్షణా రహితంగా రక్తం వచ్చేలా కొట్టారని వాపోయారు. పోలీసులు పిర్యాదు తీసుకున్నారు కానీ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అవేదన వ్యక్తం చేశారు.

