
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే అధితి గజపతి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం విజయనగరంలో గోడపత్రికను విడుదల చేశారు. జూలై 2 నుంచి ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రజలను కలవాలని అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను చెప్పి ప్రజా సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.