
విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్టేషన్ మేనేజర్ పెదమజ్జి సత్యనారాయణ
ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు శనివారం జరిగాయి.వివిధ రకాల యోగాసనాలు, ప్రాణాయామం మొదలగునవి చేయడమైనది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక,శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ, సంతోషంగా జీవించవచ్చునని వారు తెలియజేశారు. ఎస్ టి ఐ రామారావు, కంట్రోలర్ పైడితల్లి , హెడ్ గాడ్ రవికుమార్, రిజర్వేషన్ కండక్టర్ అశోక్, నాన్ స్టాప్ సిబ్బంది, విచారణ సిబ్బంది , స్వీపింగ్ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.

