
ఆర్టీసీ విజిలెన్స్ నూతన కమిటీ ఎన్ని
నేడు స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో విజయనగరం ఆర్టీసీ జోన్, ఏపీ పిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాప్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక జరిగినది. ఈ సమావేశమునకు, టి.వి రావు , రాష్ట్ర అడక్ కమిటీ కన్వీనర్, ఎం. అనంత కుమార్ రాష్ట్ర అడక్ కమిటీ సభ్యులు మరియు సి.హెచ్ మోహన్ రావు , సిఎస్ఐ, విశాఖపట్నం రీజన్ హాజరైనారు.
ఈ సందర్భంగా విజయనగరం జోన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోబడినది.
సిహెచ్ మోహన్ రావు సీఎస్ఐ, విశాఖపట్నం జోనల్ అధ్యక్షులు గాను,
టీ.ఎస్ ప్రసాద్, ఆర్ హెచ్ సి, కార్గో విశాఖపట్నం జోనల్ అధ్యక్షులు గాను,
డి శ్యాంసుందర్రావు, ఆర్ సి, జోనల్ వర్క్ షాప్, విజయనగరం జోనల్ సెక్రెటరీ గాను మరియు ఈస్ట్ గోదావరి విశాఖపట్నం ఎన్ ఇ సి మరియు నానపరేషన్ యూనిట్ కమిటీలను కూడా ఎన్నుకోబడినది. ఈ సర్వసభ్య సమావేశం నాకు సుమారు 60 మంది సభ్యులు హాజరైనారు పై కమిటీలని ఏకగ్రీవంగా ఎన్నుకోబడినది.