
ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం పోస్ట్ ఆఫీసులో NPCI లింక్ సులభంగా చేసుకోవచ్చని విజయనగరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల సొమ్ము నేరుగా లబ్దిదారుని ఖాతాలో పడటానికి NPCI లింక్ తప్పనిసరి అని పేర్కొన్నారు.
అర్హులు దగ్గరలోని పోస్ట్ ఆఫీసుకి వెళ్లి ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.