13 ఏళ్లు గడిచిన న్యాయం జరగటం లేదు వంగర మండలం లక్ష్మీపేీటలో దళితులపై దాడులు జరిగి 13 ఏళ్లు అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్కు దళిత నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. దళితులపై మారణకాండకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. పక్షపాతంగా వ్యవహరిస్తున్న ప్రత్యేక జడ్జిని తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.