
సాలూరులో నేటి నుంచి ఈనెల 21వరకు జరగనున్న శ్యామలాంబ అమ్మవారి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు లను ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం బుధవారం 80 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని కోరారు.