A2Z सभी खबर सभी जिले की

క్షేత్ర స్ధాయిలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్పరధం’తో ప్రచార

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

 

 

మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను యువతకు వివరించి, వారిని మాదకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంకల్పించి ప్రత్యేకంగా
‘సంకల్ప రధం’ ను రూపొందించి, రాష్ట్ర హెూంశాఖామాత్యులు చేతులు మీదుగా ప్రారంభించినట్లుగా జిల్లా ఎస్పీ
తెలిపారు. ఈ సంకల్ప రధంతో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొని వచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా రోజూ ఒక మండలాన్ని
సందర్శించి, స్థానిక పోలీసు స్టేషను అధికారి మరియు సిబ్బంది సహకారంతో ఉదయం కళాశాలల్లో వాహనాన్ని నిలిపి,
విద్యార్ధులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించనున్నామన్నారు. అదే విధంగా సాయంత్రం సమయాల్లో
అదే మండలంలోని ముఖ్య ప్రాంతం లేదా కూడలిలో వాహనాన్ని నిలిపి, ప్రజలకు, యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలను వివరిస్తూ వారిలో చైతన్యం నింపుతున్నామన్నారు. జనవరి1 నుండి మే14 వరకు జిల్లా వ్యాప్తంగా 155 స్కూల్స్ ను సందర్శించి, 32,226 మంది విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను
వివరించి, వాటికి దూరంగా ఉండాలని అవగాహన కల్పించామన్నారు. అదే విధంగా 190 ప్రాంతాలు/కూడళ్ళలో
‘సంకల్ప రధం’తో 18,953 మంది ప్రజలకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించి, అవగాహన
కల్పించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఇందుకు సంబంధించి ఒక షెడ్యూలును రూపొందించడం జరిగిందన్నారు. షెడ్యూలు ప్రకారం స్థానిక పోలీసు
అధికారులు, సిబ్బంది ప్రతీ రోజూ ఒక మండలంలోని ఒక కళాశాల, ముఖ్య కూడలిలో వాహనాన్ని నిలిపి, మాదక ద్రవాల
వలన కలిగే దుష్ప్రభావాలను వీడియోలు ప్రదర్శించి, వివరించనున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలను సంకల్ప రధం సందర్శించే విధంగా షెడ్యూలు రూపొందించామని, సంకల్ప రధంతో వీడియోలను ఆయా
మండలాల్లో ప్రదర్శించి, ప్రజలు, యువతకు రహదారి భద్రత, మహిళల భద్రత, సైబరు మోసాలు పట్ల అవగాహన
కల్పించి, వారిని చైతన్యపర్చనున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

Related Articles
Back to top button
error: Content is protected !!