A2Z सभी खबर सभी जिले की

వీరజవాన్‌ కుటుంబానికి వైసీపీ చెక్కు అందజేత

పాకిస్థాన్‌ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన అగ్నివీర్‌ మురళీనాయక్‌ కుటుంబానికి వైసీపీ రూ.25 లక్షలను అందించింది. ఈ మేరకు మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌, వైసీపీ నేతలు వీర జవాన్‌ కుటుంబానికి చెక్కును అందజేశారు. ఈనెల 13న మురళీనాయక్‌ కుటుంబాన్ని మాజీ సీఎం జగన్‌ పరామర్శించిన విషయం తెలిసిందే. మురళీ తల్లిదండ్రులు శ్రీరామ్‌ నాయక్‌, జ్యోతిబాయిలకు ఆయన ధైర్యం చెప్పారు.
ఆ సమయంలోనే రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

Back to top button
error: Content is protected !!