విజయనగరంలోని పలు ప్రాంతాల్లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాలి EE త్రినాథరావు చెప్పారు. ఉడా సబ్ స్టేషన్, వంటితాడి అగ్రహారం సబ్ స్టేషన్ పరిధిలో ఫీడర్ మరమ్మతు పనులు కోసం ఆయా ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. ఉడా సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 7.30గంటల నుంచి 10.30 వరకు, వంటితాడి అగ్రహారం సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 10.30 నుంచి 1.30 వరకు విద్యుత్ ఉండదన్నారు.