
“తల్లికి వందనం’ కింద చదువుకునే పిల్లలందరికీ జూన్ 15న ₹15,000 చొప్పున అందిస్తామని మంత్రి సవిత వెల్లడించారు. భావితరాల భవిష్యత్ కోసం CM చంద్రబాబు పటిష్టమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారన్నారు. బీసీ యువతకు సివిల్స్, మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణను అందిస్తున్నామని తెలిపారు. టెన్స్, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన గురుకులాల విద్యార్థులకు ఆమె ఇవాళ విజయవాడలో నగదు ప్రోత్సాహకాలు అందించారు.