
విజయనగరంలో ‘శుభం’ చిత్ర యూనిట్ సందడి చేసింది. మంగళవారం రాత్రి సప్తగిరి థియేటర్కు నటీనటులతో పాటు దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులు వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందన్నని వారు చెప్పుకొచ్చారు.