
విజయనగరం కార్పొరేషన్ లోని శ్మశానం భూమి పై కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని గ్రామ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ శ్మశానం వాటిక అనేది గత 100 ల సంవత్సరాలు పైచిలుకల నుండి మా పూర్వీకాలనుండి నేటి వరకు ప్రజలందరికీ స్మశానవాటిక (స్వర్గధామం) మృతుల అంత్యక్రియలకు ఉపయోగించే సామూహిక ఆస్తి. అలాంటి స్థలాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించడం మానవతా విలువలకు విరుద్ధం.
ప్రజల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని, సంబంధిత అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి శ్మశానం భూమిని యధాస్థితికి తీసుకురావాలని కోరుతున్నాము.
అలాగే భవిష్యత్తులో ఇలాంటి అక్రమ కబ్జాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
