
🌀 *ఒక్క రోజునే జిల్లా వ్యాప్తంగా 255 OD కేసులు, 53 COTPA కేసులు నమోదు చేసామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్*
🌀 *పట్టుబడిన మందుబాబులకు జిల్లా ఎస్పీగారి ఆదేశాలతో కౌన్సిలింగు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు*
విజయనగరం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, ప్రజాశాంతికి భంగం కలిగించినా, విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో సిగరెట్స్, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు జూలై 20న హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మందుబాబులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టేందుకుగాను, విద్యాసంస్థలకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించిన వ్యాపారులపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి, న్యూసెన్సు చేస్తూ, ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని, పట్టుబడిన మైనర్లుకు, మందుబాబులకు కౌన్సిలింగు నిర్వహించాలని
అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సంబంధిత పోలీసు అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా లే-అవుట్లు, గ్రామ శివారు ప్రాంతాల్లోను, నగర శివారు ప్రాంతాల్లోను, బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పోలీసు అధికారులు, సిబ్బంది డ్రోన్స్ తో దాడులు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్న మందుబాబులపై కేసులు నమోదు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
అదే విధంగా విద్యాసంస్థలకు 100మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు చేసే కిరాణా, పాన్ షాపు వ్యాపారులపై కూడా దాడులు చేపట్టామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులపై COTPA చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, వారిపై జరిమానాలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై జూలై 19న ఒక్కరోజునే 255 కేసులు నమోదు చేశారు. అదే విధంగా విద్యా సంస్థలకు సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించిన వారిపై 53 కేసులు నమోదు చేసి, జరిమానగా వారిపై రూ.8,500/- విధించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
మద్యం సేవించి, పట్టుబడిన మందుబాబులకు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దని, ప్రజాశాంతికి భంగం కలిగించవద్దని, విద్యాసంస్థలకు సమీపంలో పొగాకు ఉత్పత్తులను విక్రయించవద్దని
సంబంధిత పోలీసు అధికారులు కౌన్సిలింగు నిర్వహించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.