
విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి గారు పత్రికా విలేకర్ల సమావేశం లో గంజాయి సాగు, అక్రమ రవాణా, వినియోగము, నిందితుల అరెస్టు, వారి ఆస్తుల జప్తు, డీ-అడిక్షన్ మొదలగు అంశముల గురించి వివరించడం జరిగినది.
అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు పంపిణీ: గిరిజనులు గంజాయి సాగు వైపు మళ్లకుండా, వారిని ప్రత్యామ్నాయ పంటల వైపు దారితీసేందుకు ప్రభుత్వం సహకారంగా 2024 – 2025 లలో 10,803 ఎకరాలలో, 4.68 మిలియన్ల విత్తనాలను ఉచితంగా పంపిణీ చేసినారు. ఇది వారి జీవనోపాధిని చక్కదిద్దే ప్రక్రియలో ఒక భాగమని పేర్కొన్నారు. ఫలితముగా జిల్లా లో గంజాయి సాగు తగ్గుముఖం పట్టింది. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించేందుకు డ్రోన్లు వినియోగిస్తున్నామని, ఈ చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు.ఈ నెల 5 వ తారీకున పాడేరు లో జిల్లా స్థాయి అధి కారులతో సమావేశం నిర్వహించి ఈ సంవత్సరం సాగు కాలం లో తీసుకోవాలసిన జాగ్రత్తలు, గంజాయి సాగు నివారణ చర్యలు గురించి అన్నీ భాగస్వామ్య శాఖలతో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరిగినది. గ్రామ స్థాయి లో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను భాగస్వామ్యం చేసి గ్రామస్తులతో గంజాయి సాగు నిర్మూలనకు గ్రామ సభలు నిర్వహించి తీర్మానం చేయాలని ఆదేశించడం అయినది. గంజాయి సాగు నిర్మూలన కోసం ప్రజల్లో అవగాహన పెంచడం ఎంతో అవసరం కనుక గ్రామ స్థాయి లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. గంజాయి సాగు, రవాణా అరికట్టుటకు గ్రామ స్థాయి నుండి సమాచార సేకరణ జరుగుతుంది.
గడచిన 2024-2025 వ సంవత్సర కాలము లో గంజాయి అక్రమ రవాణా పై 694 కేసులు నమోదు చేసి 40,063 కిలోల గంజాయి, 18 కిలోల హసిష్ ఆయిల్ స్వాధీన పర్చుకొని , 478 వాహానాలను జప్తు చేసి, 1945 ముద్దాయి లను అరెస్ట్ చేయటం జరిగినది. ఒడిష రాష్ట్ర ఉన్నత అడికారులతో ఎప్పటికప్పడూ శమావేశాలు నిర్వహించడం జరుగుతుంది.
గంజాయి అక్రమ రవాణా అరికట్టుటకు గాను 26 స్టాటిక్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి, వాటికి సీసీటివి లను అమర్చడం జరిగినది. ఈ చెక్ పోస్ట్ ల వద్ద 183 కేసులు నమోదు చేసి 11047 కిలో ల గంజాయి, 2.1 కిలోల హసిష్ ఆయిల్ స్వాధీన పర్చుకొని , 469 ముద్దాయి లను అరెస్ట్ చేయటం జరిగినది. వీటికి అదనం గా 289 డైనమిక్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చెక్ పోస్ట్ ల వద్ద 237 కేసులు నమోదు చేసి 21070 కిలో ల గంజాయి, 1.05 కిలోల హసిష్ ఆయిల్ స్వాధీన పర్చుకొని , 743 ముద్దాయి లను అరెస్ట్ చేయటం జరిగినది.
అక్రమ గంజాయి రవాణా వ్యాపారం చేసే 8 మంది నేరస్తులకి చెందిన 9,76,84,724 రూపాయల ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగినది. గంజాయి అక్రమ రవాణాలో పాల్గొంటున్న వ్యక్తుల ఆస్తులను గుర్తించి, ప్రజల సహకారంతో సమగ్ర సమాచారం సేకరించాల్సిన అవసరాన్ని తెలియజేశారు.1310 మంది గంజాయి నేరస్తుల కదలికల మీద నిఘా కోసం షీట్స్ తెరవడం జరిగినది. 50 మంది ముద్దాయి ల మీద PD చట్టం మరియు 19 మంది ముద్దాయి ల మీద PIT NDPS చట్టం ప్రయోగించడానికి ప్రతిపాదించడం జరిగినది. తరుచుగా గంజాయి రవాణా కార్యకలాపాలలోy పాలుపంచుకొనే 527 మంది నేరస్తులను మరియు గంజాయి తో పాటు ఇతర నేరములలో పాల్గొన్న 348 మంది నేరస్తులను గుర్తించడం జరిగినది. నేర తీవ్రతను బట్టి వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగినది.
ఈ ఏడాది 2024-2025 వ సంవత్సర కాలము లో 23 కేసు లలో 40 మంది ముద్దాయి లకు కోర్టు లు శిక్షలు విధించడం జరిగినది. వీరిలో 20 మంది ముద్దాయి లకు 10 నుండి 20 సంవత్సరాలు వరకు శిక్ష లు విధించడం జరిగినది.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టం గురించి పాఠశాల, కళాశాల లలో విద్యార్థులకు పోస్టర్లు, ఫ్లెక్సీలు, వాల్ పెయింటింగ్స్, సామాజిక మాధ్యమాలు & మీడియా ద్వారా అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యం గా నిర్ణయించడం జరిగినది. ఈ ఏడాది కాలములో 10,654 అవగాహనా సదస్సులు నిర్వహించి 3039 విద్యా సంస్థ లను మరియు అన్ని గ్రామాలను భాగస్వామ్యం చేయడం జరిగినది.
గంజాయి వినియోగంలో పాలుపంచుకున్నవారిని కేవలం శిక్షించడం కాకుండా, వారి పునరావాసం కోసం పునరావాస కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 51 మంది గంజాయి వినియోగదార్లపై కేసులు నమోదు చేయడమే కాకుండా 161 మంది గంజాయి వినియోగదార్లను పునరావాస కేంద్రాలకు చికిత్స నిమిత్తం తరలించడం జరిగినది.
గంజాయి కేసులు లలో సమగ్ర దర్యాప్తు కొరకు పోలీస్ అధికార్లకు ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిబ్రవరి నెలలో అనకాపల్లి, విజయనగరం మరియు శ్రీకాకుళం లలో 4 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఇటీవల దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఆద్వర్యం లో Lead Investigators course నిర్వహించడం జరిగినది. దీనిద్వారా దర్యాప్తు అధికారులు క్షుణ్ణంగా సాక్ష్యాధారములు సేకరించి నిందితులకు కఠిన శిక్షలు పడే విదముగా నైపుణ్యం పెంపొందించడం జరిగినది.
పాత కేసుల లో పట్టుబడిన 72,196 కేజీ ల గంజాయి 74.26 కేజీ ల హసిష్ ఆయిల్ ను జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలలో ధ్వంసం చేయడం జరిగినది.
గంజాయి నిర్మూలన ఒక్క పోలీసుల బాధ్యత కాదు, ప్రతి పౌరుడు సహకరించాలి. దీనికోసం సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులు, ప్రజా ప్రతినిధులు సహకారంతో చిట్ట చివరి స్థాయి వరకూ అవగాహన కలిగించడానికి రాబోయే 6 నెలల కాలమునకు ప్రణాళికలు రచించడం జరిగినది. గ్రామ పండుగలలో, తీర్ధాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, స్వచ్చంద సంస్థల కార్యకలాపాలలో కూడా గంజాయి నిర్మూలన ఒక భాగం చేయడానికి నిర్ణయించడం జరిగినది. యువతను రక్షించేందుకు, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు మనందరం కలసి పనిచేయాలి అని డీఐజీ గోపీనాథ్ జట్టి గారు పిలుపునిచ్చారు.