ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరం పైడితల్లమ్మ దేవస్థానం కార్యనిర్వహణ అధికారిణిగా కే.శిరీష బుధవారం కార్యాలయ ఆవరణలో బాధ్యతలు చేపట్టారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని పేర్కొన్నారు.