విజయనగరం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారించాలని సీఐటీయూ ఆధ్వర్యములో కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలను థర్డ్ పార్టీ నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వం నుంచి వేతనాలు చెల్లించాలని కోరారు.