విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రం లో కోడి రామ్మూర్తి వ్యాయామ సమాజం ఆధ్వర్యంలో యోగాంధ్ర సందర్భంగా యోగా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అభినవ భీమ పెద్ది లక్ష్మి నారాయణ తెలిపారు. వాసు పర్యవేక్షణలో ఉదయం 6 గంటలనుంచి 7 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.