
గిరిజన ఎంపీటీసీ సభ్యుడు పాలవలస గౌరుని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సన్మానించారు.
విజయనగరంలో శనివారం ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. గిరిజనులు సమస్యలపై నిరంతరం పని చేస్తున్న బాడంగి మండలం గజరాయునివలస ఎంపీటీసీ సభ్యుడు పాలవలస గౌరుని సత్కరించి, ఆయన సేవలను కొనియాడారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి ఎంపీటీసీ వివరించి పరిష్కరించాలని కోరారు.
