
విజయనగరంలోని జిల్లా వైద్యారోగ్య శాలి కార్యాలయంలో మాతృ, మరణాలపై DMHO జీవన రాణి శనివారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సంభవించిన ఒక మాతృ మరణం, ఐదు శిశు మరణాలపై కమిటీ సమీక్ష జరిపింది. గర్భిణులపై వైద్యారోగ్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని, మొదటి రోజు నుంచే వైద్య పరీక్షలు జరిపి నివేదికలు ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలని DMHO సూచించారు. మరణాలు సంభవిస్తే చర్యలు తప్పవన్నారు.