
ఉగ్ర పేలుళ్ల కుట్ర కేసు నిందితులు సిరాజ్, సమీర్లను NIA విచారిస్తోంది. ఈ క్రమంలో వారు భయంకరమైన విషయాలను వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. అహీం అనే సంస్థను స్థాపించిన సిరాజ్ 20 మందిని మానవబాంబులుగా సిద్ధం చేసినట్లు తెలిసింది.
విజయనగరం, HYD, ముంబై, ఢిల్లీ, బెంగళూరులో పేలుళ్లకు వీరు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం.
వీరికి సౌదీ, ఒమన్ నుంచి ఆర్థిక సాయం అందినట్లు అధికారులు గుర్తించారు.