ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నాయకుడు గురాన అయ్యలు మాట్లాడుతూ, చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మరియు ప్రజలను మంచి మార్గం వైపు నడిపించడానికి సమాజంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడారు. మరో ముఖ్య అతిథి విజయనగరం రూరల్ సిఐ బి. లక్ష్మణరావు మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న వివిధ చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి మాట్లాడారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఎదురైతే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి తల్లిదండ్రుల బాధ్యతల గురించి న్యాయవాది మాన్యల శ్రీనివాస్ అవగాహన కల్పించారు. బ్యాంకింగ్ రంగానికి కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ, OTP విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా తమన్నా ఫౌండేషన్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ చట్టాల గురించి అవగాహన పెంచడమే కాకుండా, సమాజాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ పత్తి గుళ్ల వెంకట్ రావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎమ్మార్వో పెద్దాడు జనార్ధనన్, బీసీ కాలనీ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.