
రేపు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించే ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. తొలి కేటగిరీలో ఢిల్లీ, ముంబై, సూరత్, వడోదర, కక్రాపర్, తారాపూర్, తాల్చేర్, కోటా, రావత్, చెన్నై, కల్పక్కం, నరోరా జిల్లాలున్నాయి. 2వ దాంట్లో హైదరాబాద్, విశాఖపట్నం సహా 201 జిల్లాలు, 3వ జాబితాలో 45 జిల్లాలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే, పాక్తో సరిహద్దు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసింది.