
జూన్ 1 నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, పంచదార, ఇతర రేషన్ సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. MDU వాహనాలను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో మండల కేంద్రాల నుంచి స్టాక్ను రేషన్ షాపులకు తరలిస్తున్నారు. అటు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డీలర్లు ఇంటికి తీసుకొచ్చి సరకులు సరఫరా చేస్తారు.