A2Z सभी खबर सभी जिले की

*||మృతి చెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత’ అందజేత||*

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,*

 

🌀 *అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబులు కుటుంబానికి ‘చేయూత’గా రూ.1,48,600/- ల చెక్ ను అందజేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

🌀 *పోలీసు కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

Related Articles

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో ఆర్మ్ డ్ రిజర్వు విభాగంలో హెడ్ కానిస్టేబులుగా పని చేసి, ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందిన నర్సింహ పట్నాయక్ కుటుంబానికి ‘చేయూత’ను అందించేందుకు జిల్లా పోలీసుశాఖలో పని చేసే పోలీసు అధికారులు, సిబ్బంది అందించిన రూ.1,48,600/-ల చెకన్ను అతని సతీమణి శ్రీమతి స్వర్ణలత పట్నాయక్ గార్కి జిల్లా ఎస్పీవకుల్ జిందల్, ఐపిఎస్ ఆగస్టు 5న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు
లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చి, కొంత నగదును ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత” గా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ మరియు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Back to top button
error: Content is protected !!