
విజయనగరం జిల్లా పెదమానాపురం పోలీసు స్టేషను పరిధిలోని సంత శివార్లలో ఓపెన్ డ్రింకింగు చేస్తున్న వారిపై జూలై 26న పోలీసులు డ్రోన్స్ సహాయంతో రైడ్స్ నిర్వహించి, ఓపెన్ డ్రింకింగుకు పాల్పడుతున్న 11మందిపై
పెద మానాపురం పోలీసులు కేసులు నమోదు చేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై
ఆకస్మికంగా దాడులు నిర్వహించేందుకు డ్రోన్సును విస్తృతంగా వినియోగిస్తున్నా మన్నారు. ఇందులో భాగంగా జూలై 26న సాయంత్రం పెద మానాపురం పోలీసు స్టేషను పరిధిలోని సంత శివార్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై డ్రోన్సోతో నిఘా ఏర్పాటు చేసామన్నారు. డ్రోన్స్ ప్రయోగించి, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 11మంది వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొన్నామన్నారు. వారిపై ఓపెన్ డ్రింకింగు కేసులను పెద మానాపురం
ఎస్ఐ ఆర్.జయంతి నమోదు చేసారని జిల్లా ఎస్పీ తెలిపారు. నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు, ట్రాఫిక్ నియంత్రణకు, జాతరల్లోను డ్రోన్సును విస్తృతంగా వినియోగించాలని,
శివారు ప్రాంతాలపై డ్రోన్స్ ను వినియోగించి, నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
ఈ దాడుల్లో పెద మానాపురం ఎస్ఐ ఆర్.జయంతి, డ్రోన్ పైలట్ వెంకటేష్, స్టేషను సిబ్బంది పాల్గొన్నారు.