
రైళ్ళలో గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా జూలై 11న రాత్రి ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో లోకల్ పోలీసు, జి.ఆర్.పి., ఈగల్, ఆర్.పి.ఎఫ్ పోలీసులు మరియు డాగ్ స్క్వాడ్తో సంయుక్తంగా బృందాలను ఏర్పాటు చేసి, ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూలై 11న తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – రాష్ట్ర డిజిపి ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు ఈగల్, లోకల్ పోలీసు, గవర్నమెంట్ రైల్వే పోలీసు, డాగ్ స్క్వాడ్ మరియు రైల్వే ప్రొటక్షన్ పోలీసులతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి, ఫలక్ నుమా ట్రెయిన్లో ఆకస్మిక తనిఖీలు
నిర్వహించామన్నారు. గంజాయి ప్రధానంగా ఒడిస్సా రాష్ట్రం నుండి ట్రెయిన్స్ ద్వారా ఇతర ప్రాంతాలకు అక్రమంగా
రవాణ అవుతుందన్న సమాచారంతో ప్రత్యేకంగా ట్రెయిన్స్న లక్ష్యంగా చేసుకొని తనిఖీలు చేపట్టామన్నారు. ఈ బృందం విజయనగరం రైల్వే స్టేషనులో ఫలక్నుమా ఎక్సప్రెస్లో విశాఖపట్నం వరకు ప్రయాణించి, బృందాలుగా ఏర్పడి అన్ని భోగీల్లోను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి, అధికారులకు ప్రయాణికులతో వ్యవహరించాల్సిన తీరు గురించి విజయనగరం వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్ ముందుగా వివరించి, వారు నిర్వర్తించే విధులు గురించి దిశా నిర్ధేశం చేసారు. ఫలక్నుమా ఎక్సప్రెస్ ట్రెయిన్ లోని అన్ని భోగీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, బ్యాగులను, లగేజ్, సూట్కేసులను నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. తనిఖీలో ఎటువంటి గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలు లభించలేదన్నారు. రాష్ట్రంలో గంజాయిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా ఈగల్ టీమ్స్ ను నియమించిందన్నారు. ఈగల్ టీమ్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే
రోజున వివిధ ట్రెయిన్స్లో తనిఖీలు చేపట్టామన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగం గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబరు 1972కు అందించాలని జిలఎస్పీ వకుల్ జిందల్ ప్రజలను కోరారు.
ఈ తనిఖీల్లో తెర్లాం ఎస్ఐ సాగర్ బాబు, జిఆర్పి ఎస్ఐ మధుసూధనరావు, ఆర్.పి.ఎఫ్. ఎస్ఐ శ్రీధర్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మరియు 40మంది పోలీసు అధికారులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.