
టు టౌన్ ఎస్.ఐ మురళి పై జర్నలిస్టులు ఫిర్యాదు…
విజయనగరం….
పూల్ బాగ్ అయ్యప్పనగర్ లో వృద్ధ దంపతుల (రిటైర్డ్ డీఈవో ఎస్. అప్పలనాయుడు) పై దుండగులు దాడి చేసిన 24 గంటల తర్వాత విచారణ కోసం వచ్చిన టు టౌన్ ఎస్ ఐ మురళి
సీనియర్ జర్నలిస్ట్, 10టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎం.ఎం.ఎల్.నాయుడుపై దౌర్జన్యం పాల్పడిన ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలి అని డిమేండ్ చేస్తూ విజయనగరం ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు అందరు కలిసి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కి, జిల్లా ఏ.ఎస్పీ సౌమ్య లత కి శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ ఒక నేర వార్తకు సంబంధించి మొబైల్ ఫోన్ లో వీడియోలు తీస్తుండగా ఎస్.ఐ. తీవ్ర అభ్యంతరం చెప్పారు అని,
అనంతరం చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, ఎస్ ఐ మురళి దుర్భాశలడారు అని తెలిపారు.
ఇదేమీ పద్ధతి అంటూ ప్రశ్నించిన జర్నలిస్ట్ నాయుడుపై దౌర్జన్యం చేస్తూ విచక్షణ కోల్పోయారు అని, ఫోన్ లాక్కొని స్టేషన్ కి రావాలంటూ ఖాకీ క్రౌర్యం చూపించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా అయితే ఎవడికి ఎక్కువ అంటూ జులుం ప్రదర్శిస్తూ నా పవర్ ఏంటో చూపిస్తానంటూ బెదిరింపులు పాల్పడ్డారు అని తెలిపారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకోని శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సరైన చర్యలు తీసుకోకుంటే మంగళవారం ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నాకు సమాయత్తమావుతాం అని తెలిపారు. ఎస్ ఐ మురళి తీరుపై రాష్ట్రంలోని జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సదరు ఫిర్యాదు పై ఏ.ఎస్పీ. సౌమ్య లత ఎస్పీ దృష్టిలో పెట్టి తగిన నాయ్యం చేస్తాం అని హామీ ఇచ్చారు….ఈ కార్యక్రమం లో సీనియర్ పాత్రికేయులు, వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు….