
వృద్ధ తల్లిదండ్రులను వేధించినా, నిర్లక్ష్యం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పూల్ బాగ్ లో ప్రేమ సమాజాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల చట్టాలపై అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిరాధారణకు గురి చేస్తే చర్యలు ఉంటాయన్నారు. ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.