
జూన్ 15 నుంచి 30 వరకు దర్తి ఆబా అభియాన్ పేరుతో గిరిజన లబ్దిదారులకు పలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ శనివారం తెలిపారు. అవగాహనతో పాటు పధకాల లబ్ది చేకూర్చడానికి సంపూర్ణ శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఈ శిబిరాల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు లక్ష్యంగా జరుగుతున్న కార్యక్రమాన్ని గిరిజనులు వినియోగించుకోవాలని కోరారు.