A2Z सभी खबर सभी जिले की

*స్పీడ్ బ్రేకర్స్ వేయండి, ప్రమాదాలను నివారించండి*

~త్యాడ రామకృష్ణారావు(బాలు)

జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ కు వినతిపత్రం అందజేత
స్పందించిన జె.సి స్థానిక 42 డివిజన్ పరిధిలో ఉన్న కామాక్షి నగర్ శ్రీ చైతన్య స్కూల్ వద్ద మరియు అయ్యన్నపేట జంక్షన్ వద్ద తరుచుగా వాహనాల ప్రమాదాలతో ప్రజలంతా తీవ్ర గాయాలతోను, కొన్ని సార్లు మరణాలతోను చాలా ఇబ్బందులపాలు అవుతున్నారని,తక్షణమే స్పీడ్ బ్రేకర్స్ వేసి ప్రమాదాలను అరికట్టాలని సోమవారం ఉదయం ప్రజా వినతులు పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ కుఅంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), జనసేన పార్టీ సీనియర్ నాయకులు పిడుగు సతీష్ అందజేశారు.
ఈసందర్భంగా త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ గతంలో రోడ్డ్లు మరియు భవనాల శాఖ వారికి జాతీయ రహదారుల శాఖ వారికి మరియు జిల్లా కలెక్టర్ వారికి అయ్యన్నపేట జంక్షన్ వద్ద, చైతన్య స్కూల్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ వేయించమని పలుమార్లు వినతి పత్రములు ఇచ్చినా పట్టించుకోలేదని, ప్రస్తుతం ఎక్కువగా అక్కడ ప్రమాదాలు జరిగి కొందరు వాహనదార్లు చనిపోవడం, ఆసుపత్రిపాలు అవడం జరుగుతుందని,స్థానిక ప్రజలందరి కోరికమేరకు అయ్యన్నపేట జంక్షన్ వద్ద మరియు కామాక్షి నగర్ చైతన్య స్కూల్ వద్ద స్పీడ్ బ్రేకర్స్ వేయించి ప్రమాదాలని అరికట్టి సహాయపడాలని కోరామని, జాయింట్ కలెక్టర్ స్పందించి సంబంధిత
జాతీయ రహదారుల శాఖ అధికారులకు చూడమని ఆదేశించారని తెలిపారు.
ఇకనైనా జాతీయ రహదారులు శాఖ వారు పట్టించుకొని స్పీడ్ బ్రేకర్లు వేయాలని లేదంటే ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకొని స్పీడ్ బ్రేకర్లు వేసేవరకు పోరాటం తప్పదని అన్నారు.

Check Also
Close
Back to top button
error: Content is protected !!